దేశ వాణిజ్య లోటు ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు రికార్డు స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నా, లోటు కూడా అదే స్థాయిలో పెరగడంతో వాణిజ్య లోటు పెరిగిపోతోంది. గత మేలో భారత్ ఎగుమతులు 10 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 8 శాతం పెరిగి 62 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. గత అక్టోబరు తరవాత భారీగా వాణిజ్య లోటు ఏర్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఎలక్ట్రానిక్స్, మందులు, జూట్, ఇంజనీరింగ్, ప్లాస్టిక్ వస్తువుల ఎగుమతిలో భారీ వృద్ధి నమోదైంది. మేనెలలో ముడిచమురు దిగుమతులు 23 శాతం పెరిగి 20 బిలియన్ డాలర్లకు చేరాయి.మేలో బంగారం దిగుమతులు స్వల్పంగా తగ్గాయి. పసిడి ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. మేలో ఎన్నడూ లేని విధంగా ఎగుమతులు నమోదైనా, లోటు కూడా పెరగడంతో వాణిజ్య లోటు ఏర్పడింది.