Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ఒడిషాలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ

పాతికేళ్ళ తర్వాత మారిన ప్రభుత్వం

Phaneendra by Phaneendra
Jun 13, 2024, 10:20 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

లోక్‌సభతో పాటు శాసనసభకూ ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రం ఒడిషాలోనూ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటలకే ఒడిషాలో మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో మోహన్ చరణ్ మాఝీ ఒడిషా 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, 8మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర సహాయమంత్రులతో కొత్త క్యాబినెట్ ఏర్పడింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతిథులుగా హాజరయ్యారు.

ఒడిషాకు 25 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి, తొలిసారి ఓడిపోయిన నవీన్ పట్నాయక్‌ను మోహన్ చరణ్ మాఝీ స్వయంగా తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. నవీన్ పట్నాయక్ ఆ ఆహ్వానాన్ని మన్నించి మాఝీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త ముఖ్యమంత్రికి, కొత్త మంత్రివర్గానికి శుభాభినందనలు తెలియజేసారు.

ఒడిషా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తొలిసారి పూర్తి మెజారిటీ సాధించింది. మొత్తం 147 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీ సాధించింది. గత ఎన్నికల్లో 112 సీట్లు గెలిచిన బీజేడీ ఇప్పుడు 61 సీట్లు కోల్పోయి 51 స్థానాలకు పరిమితం అయింది. కాంగ్రెస్ 14, సిపిఎం 1, స్వతంత్రులు 3స్థానాలు దక్కించుకున్నారు.

ఒడిషా ముఖ్యమంత్రి అయిన మూడవ ఆదివాసీ నాయకుడు మోహన్ చరణ్ మాఝీ. ఆయన విద్యార్ధి దశ నుంచే ఆరెస్సెస్ కార్యకర్త. విద్యాభ్యాసం పూర్తయాక సరస్వతీ విద్యామందిరంలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసారు. తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించి కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసారు. గ్రామ సర్పంచ్‌గా రాజకీయ రంగప్రవేశం చేసారు. 2000, 2009, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.

Tags: BJPMohan Charan MajhiNarendra ModiNaveen PatnaikNew GovernmentOdishaSLIDERSwearing InTOP NEWS
ShareTweetSendShare

Related News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.