టీ20 ప్రపంచకప్-2024లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. గ్రూపు-డి షెడ్యూల్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై రెండు వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. తౌహిద్ హృదయ్(40), లిటన్దాస్(36) విలువైన ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నారు.
తంజిద్ హసన్(3), సౌమ్యసర్కార్(0), కెప్టెన్ నజ్ముల్(7) వికెట్లు కోల్పోయారు. తౌహిద్, లిటన్ నాలుగో వికెట్కు 38 బంతుల్లో 63 రన్స్ చేశారు. 22 పరుగుల తేడాతో బంగ్లా ఐదు వికెట్లు కోల్పోగా మహ్మదుల్లా జట్టును విజయతీరాలకు చేర్చాడు.
శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 18 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా హసరంగ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుని 32 పరుగులు ఇచ్చాడు.
శ్రీలంక ఇన్నింగ్స్ లో నిస్సనక(47), డిసిల్వా(21) మాత్రమే రాణించారు. 20 ఓవర్లలో 124/9 స్కోరు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్(3/17), రిషాద్ హుస్సేన్ (3/22) రాణించారు. రిషాద్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.