Monday, May 26, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

తొలితరం తెలుగు సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం

param by param
May 12, 2024, 09:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Kandukuri Veeresalingam, the First Generation Social Reformer
in Andhra Pradesh

(ఇవాళ కందుకూరి వీరేశలింగం జయంతి)

తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి
వీరేశలింగం పంతులు. తెలుగు గడ్డపై తొలితరం సంఘసంస్కర్త ఆయన. మహిళల సంక్షేమం కోసం
జీవితాంతం పనిచేసాడు. స్త్రీవిద్య కోసం ఉద్యమించి బాలికల పాఠశాలను స్థాపించాడు. బాల్యవివాహాలను
వ్యతిరేకించాడు, వితంతు పునర్వివాహాలు చేయించాడు.

కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న
రాజమండ్రిలో జన్మించాడు. ఆయన తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. నాలుగేళ్ళ
పిన్నవయసులోనే వీరేశలింగం తండ్రిని కోల్పోయాడు. నానమ్మ, పెదనాన్నల పెంపకంలో
అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదవయేట బడిలో చేరి బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం,
అమరకోశం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం వంటివి నేర్చుకున్నాడు.
పన్నెండవ యేట ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. పదమూడవ యేట ఆనాటి పద్ధతుల
ప్రకారం ఎనిమిదేళ్ళ బాపమ్మతో వివాహమైంది. తర్వాత ఆమెకు రాజ్యలక్ష్మిగా పేరు మారింది.

విద్యాభ్యాసం పూర్తయాక, పెదనాన్న మరణం తర్వాత,
వీరేశలింగం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. పిల్లలకు పాఠాలతో పాటు సంఘసంస్కరణ భావాలూ
బోధించాడు. సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేసాడు. ఆ క్రమంలో
“సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ
వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి
, అవినీతిపరులను
సంఘం ముందు పెట్టడం” అనే లక్ష్యాలతో వివేకవర్ధని పత్రికను 1874 అక్టోబరులో
ప్రారంభించాడు.

తెలుగు గడ్డకు బ్రహ్మసమాజాన్ని తీసుకువచ్చింది కందుకూరి వీరేశలింగమే. అలాగే
యువజన సంఘాల స్థాపన కూడా తెలుగునాట ఆయనతోనే మొదలైంది. సమాజసేవ చేయాలనే సంకల్పంతో
1905లో హితకారిణీ సమాజాన్ని స్థాపించి తన ఆస్తి మొత్తాన్నీ ఆ సమాజానికే రాసిచ్చేసాడు.
పాతికేళ్ళు రాజమండ్రిలోనూ, ఐదేళ్ళు మద్రాసులోనూ తెలుగు పండితుడిగా పనిచేసాడు.

కందుకూరి వీరేశలింగం యుగకర్తగా ఖ్యాతి గడించాడు, గద్యతిక్కన అనే బిరుదు
గడించాడు. సంఘసంస్కరణ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, సంఘాన్ని సంస్కరించే పనిని
సాహిత్యం ద్వారానూ కొనసాగించాడు. అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వోద్యోగాన్నీ,
అబద్ధాలు ఆడకూడదని న్యాయవాద వృత్తినీ వదులుకున్న మహనీయుడు కందుకూరి. సాంఘిక
దురాచారాలపై తన వివేకవర్థిని పత్రిక ద్వారా యుద్ధమే చేసాడు. స్త్రీవిద్య కావాలి
అని నినాదాలు చేయడం మాత్రమే కాదు, దాన్ని సాధించడం కోసం బాలికా విద్యాలయం
ప్రారంభించిన మహనీయుడు ఆయన.

బాలబాలికలకు సహవిద్యా పద్ధతిని తీసుకొచ్చిందీ ఆయనే. తానే స్వయంగా పిల్లలకు
పాఠాలు బోధించేవాడు. అంటరాని కులాల పిల్లలను సైతం చేరదీసి, వారిని అందరితో సమానంగా
కూర్చోబెట్టి, వారికి పుస్తకాలు పలకాబలపాలు సమకూర్చి చదువు చెప్పాడు.
కులనిర్మూలనకు ఎంతో కృషి చేసాడు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పనిచేసాడు. వేశ్యా
వ్యవస్థకు వ్యతిరేకంగా తన వివేకవర్ధని పత్రికలో ఎన్నో వ్యాసాలు రాసాడు.

కందుకూరి పేరు చెబితే గుర్తొచ్చేది వితంతు పునర్వివాహాలు. బాల్యంలోనే
వితంతువులయ్యే ఆడపిల్లల భవిష్యత్తు నాశనమైపోకూడదనే ఉద్దేశంతో వారికి పునర్వివాహాలు
చేయించాలని ప్రచారం చేసాడు. తానే స్వయంగా వితంతు పునర్వివాహాలు జరిపించాడు. 1881
డిసెంబర్ 11న మొదటి వితంతు పునర్వివాహం తన ఇంట్లోనే చేయించాడు. మొత్తం 40 వితంతు
పునర్వివాహాలు చేయించాడు. వీరేశలింగం సంఘసంస్కరణ కార్యక్రమాలకూ ఆయన భార్య రాజ్యలక్ష్మి,
ఆయన విద్యార్ధులు, మిత్రులు సహకరించేవారు.

కందుకూరి సంఘసేవలో ఎంత కృషి చేసారో, సాహిత్యరంగంలో అంతకంటె ఎక్కువే కృషి
చేసాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ఆయన నిష్ణాతుడు. తన భావాలను సమాజంలో
వ్యాపింపజేయడానికి ఎన్నో పత్రికలు ప్రారంభించి నిర్వహించాడు. రాజశేఖర చరిత్రము అనే
నవల, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, ఆంధ్ర కవుల చరిత్ర వంటి ప్రఖ్యాతి గడించిన రచనలు సహా
130కి పైగా పుస్తకాలు రచించాడు. సంగ్రహ వ్యాకరణం రాసాడు. నీతిచంద్రిక పేరుతో
చిన్నయసూరి తెలుగులో మొదలుపెట్టిన పంచతంత్రాన్ని పూర్తి చేసాడు. ఇక ఆయన ప్రహసనాలు
సమాజంలో గొప్పపేరు గడించాయి.

తెలుగు సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన కందుకూరి వీరేశలింగం 1919 మే 27న తుదిశ్వాస
విడిచాడు. ఆయన గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం చెప్పిన పద్యం ఆయన సమాధి మీద
ఈనాటికీ నిలిచి ఉంది.

‘‘తన దేహము తన గేహము

తన కాలము తన ధనంబు తన విద్య జగ

జ్జనులకే వినియోగించిన

ఘనుడీ వీరేశలింగ కవి జనులార’’

Tags: birth anniversaryKandukuri VeeresalingamSocial Reformer
ShareTweetSendShare

Related News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.