Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home వినోదం

ఎబివిపి నేత జీవితగాధకు వెండితెర రూపం ‘జితేందర్ రెడ్డి’

param by param
May 12, 2024, 09:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Jitender Reddy, the biography of ABVP leader from Jagityal

తెలంగాణలో 80వ దశకంలో నక్సలైట్ల
అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రత్యేకించి విద్యాసంస్థలను తమ విద్యార్ధి సంఘాలతో
నింపివేసి కలుషితం చేసిన నక్సలైట్లు తమకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా
హత్యలు చేసేవారు. అలాంటి నక్సలైట్లకు కొన్నేళ్ళపాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన వీరుడు
ముదుగంటి జితేందర్ రెడ్డి. అతని జీవితగాధ ఆధారంగా వస్తున్న చిత్రం ‘జితేందర్
రెడ్డి’.

మహాభారత యుద్ధంలో, అర్జునుడి కుమారుడైన
అభిమన్యుణ్ణి ఒక్కొక్కరుగా ఎదుర్కోలేని కౌరవులు, ఆ పిల్లవాణ్ణి ఏకాకిని చేసి అందరూ
కలిసి మూకుమ్మడిగా హతమార్చారు. అలాగే, ఎబివిపి నేత అయిన జితేందర్ రెడ్డిని నేరుగా ఎదుర్కోలేని
నక్సలైట్లు గుంపుగా చుట్టుముట్టి కాల్చిచంపారు. 1987 ఏప్రిల్ 9న దాదాపు ముప్ఫైమంది
నక్సలైట్లు చుట్టుముట్టి ఒంటరిగా ఉన్న జితేందర్ రెడ్డిని దారుణంగా హతమార్చారు.

సామాజిక వ్యవస్థల పట్ల నమ్మకం లేని నక్సలైట్లు
ప్రజలను ఏమార్చో హతమార్చో భయపెట్టో బెదిరించో తమ దారికి తెచ్చుకునే క్రమంలో ఎన్నో
అరాచకాలకు పాల్పడ్డారు. సహజంగా ఉద్రేకం ఎక్కువగా ఉండే యవ్వనదశలోని విద్యార్ధులను
ఆకట్టుకుని అంతులేనన్ని అకృత్యాలు చేసారు. అలాంటివారికి ఎదురొడ్డి, జాతీయవాద
దృక్పథాన్ని విద్యార్థుల్లో ప్రచారం చేయడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
చేసిన కృషి, ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న కష్టనష్టాలూ ఎన్నెన్నో. తెలంగాణ వ్యాప్తంగా
కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో తమను ప్రతిఘటించిన విద్యార్ధి పరిషత్ నాయకులను,
కార్యకర్తలను ఎందరినో నక్సలైట్లు హతమార్చారు.

తెలంగాణలోని జగిత్యాల ప్రాంతంలో 80వ
దశకంలో నక్సలైట్లకు ఎదురుతిరిగి, వారిని మూడుచెరువుల నీళ్ళు తాగించిన వ్యక్తి
జితేందర్ రెడ్డి. విద్యార్ధి దశ నుంచే వారికి పక్కలో బల్లెంగా మారాడు. తర్వాత
ఎబివిపి నాయకుడిగా నక్సలైట్లను, వామపక్ష విద్యార్ధి సంఘాల ముసుగులోని సంఘవిద్రోహశక్తులనూ
నానాతిప్పలూ పెట్టాడు. వారికి సింహస్వప్నంగా నిలిచాడు. నక్సలైట్లను దేశభక్తులుగా
వర్ణించిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుకు నక్సలైట్లు దేశభక్తులు కాదు,
దేశద్రోహులు అని నేరుగా చెప్పిన ధైర్యవంతుడు జితేందర్ రెడ్డి.

ఇప్పటికీ తెలంగాణ ప్రాంత ఎబివిపి కార్యకర్తలు,
నేతలు ప్రేమగా ‘జిత్తన్న’ అని పిలుచుకునే జితేందర్ రెడ్డి జీవితకథ వెండితెర మీద
ఆవిష్కృతం అవుతోంది. జితేందర్ సోదరుడు ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ
సినిమాకు విరించివర్మ దర్శకత్వం వహించారు. గోపిసుందర్ సంగీతం అందించగా జ్ఞానశేఖర్
డిఒపిగా వ్యవహరించారు.

ఈ జీవితగాధాచిత్రంలో యువనటుడు రాకేష్
వర్రే కథానాయకుడిగా నటించారు. గతంలో బాహుబలి, మిర్చి వంటి చిత్రాల్లో కీలకపాత్రలు
పోషించి ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో అయిన రాకేష్, ఈ చిత్రంలో తన ప్రతిభను
చాటారన్న సంగతి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్‌ చూస్తే అర్ధమవుతుంది. జితేందర్ రెడ్డి సమకాలికులు, ఎబివిపి కార్యకర్తలు ఎందరినో కలిసి ఆయన
వ్యక్తిత్వాన్ని వాస్తవికంగా చూపేందుకు శ్రమించానని రాకేష్ చెబుతున్నారు.

ఇప్పటికే దేశ చరిత్ర అంతా దొంగలు,
దోపిడీదారులు చెప్పిన కథలతో నిండిపోయి ఉంది. దాన్ని ప్రక్షాళన చేసి అసలైన చరిత్రను
బైటపెట్టాల్సిన సమయమిది. సామ్యవాదం ముసుగులో నక్సలైట్లు పాల్పడిన అరాచకాలను,
జాతీయవాద స్ఫూర్తిని ప్రజలకు చేరువ కానీయకుండా అడ్డుపడిన కుతంత్రాలను, దేశభక్తి
కలిగిన జితేందర్ రెడ్డి వంటి యువకుల త్యాగాలనూ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం
ఎంతయినా ఉంది. మే 3న విడుదల కానున్న ‘‘జితేందర్ రెడ్డి –
HI’S’TORY NEEDS TO BE TOLD
’’ సినిమా, చరిత్రలో మరుగున పడిన కోణాలను వెలికితీస్తుంది.

Tags: ABVP leaderbiographical filmJagityalJitender ReddyTelangana
ShareTweetSendShare

Related News

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్
general

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
general

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు
general

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్
Entertainment

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్

శబరిమల గుడిలో మమ్ముట్టి పేరుమీద మోహన్‌లాల్ పూజలు, ముస్లిముల ఆగ్రహం
Latest News

శబరిమల గుడిలో మమ్ముట్టి పేరుమీద మోహన్‌లాల్ పూజలు, ముస్లిముల ఆగ్రహం

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.