Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

రాముడికి మావోయిస్టుల చెర నుంచి 21ఏళ్ళ తర్వాత విముక్తి

param by param
May 12, 2024, 09:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Ram Temple locked by Maoists 21 years ago, unlocked now

రామాయణంలో రాముడికి వనవాసం 14ఏళ్ళే. ఆ సమయంలో
కూడా ఆయన స్వేచ్ఛగా వనవిహారం చేసాడు. కానీ కలియుగంలో మావోయిస్టులు 21ఏళ్ళపాటు
రాముణ్ణి చెర పట్టారు. రామమందిరానికి తాళం వేసేసారు. ఇన్నాళ్ళకు ఆయనకు విముక్తి
లభించింది.

రాముడి జన్మభూమి అయోధ్యలో ముష్కరులు కూల్చేసిన
ఆయన గుడిని మళ్ళీ కట్టుకోడానికి 5వందల యేళ్ళు పట్టింది. అలాగే మావోయిస్టుల
ప్రాబల్య రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో రాముడి గుడిని తెరుచుకోడానికి 21ఏళ్ళు పట్టింది.
ఇప్పుడు కూడా, ఆ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ దళాలు ఒక క్యాంపు ఏర్పాటు చేసుకున్నందున
గుడి తెరుచుకుంది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లాపేండా
గ్రామంలో రామాలయం ఉంది. అయితే దాన్ని 2003లో మావోయిస్టుల బెదిరింపులకు భయపడి
మూసివేసారు. ఇవాళ్టి వరకూ ఆ గుడిని తెరిచే సాహసం ఎవరూ చేయలేకపోయారు.

ఆ గ్రామంలోని రామాలయాన్ని 1970లో బిహారీ మహరాజ్
అనే వ్యక్తి నిర్మించాడు. గుడి కట్టే సమయానికి ఆ ప్రాంతంలో కనీస రహదారి సౌకర్యమైనా
లేదు. అయినా గ్రామస్తులు రామయ్య మీద భక్తితో 80 కిలోమీటర్లకు పైగా దూరం నడుచుకుంటూ
వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి గుడి నిర్మాణం పూర్తి చేసారు.

గుడి కట్టిన తర్వాత గ్రామస్తుల్లో ధార్మిక నిష్ఠ
జాగృతమైంది. చాలామంది గ్రామీణులు స్వచ్ఛందంగా మాంసాహారం, మద్యపానం మానేసారు.
హింసాత్మక కార్యక్రమాలకు దూరం జరిగారు. ధార్మికమైన జీవితం గడపడం ప్రారంభించారు. క్రమంగా
ఆ గుడి దగ్గర జాతర కూడా మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వేలాది భక్తులు
రామయ్యను దర్శించుకోడానికి వచ్చేవారు. అయోధ్య నుంచి కూడా సాధుసంతులు అక్కడికి
వస్తుండేవారు.

అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని మావోయిస్టులు
సర్వనాశనం చేసేసారు.

2003 సమయంలో మావోయిస్టులు ఆ గ్రామంలో పాగా
వేసారు. అయితే అక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుండడంతో వారి రహస్య కార్యకలాపాలు
నిర్వహించడం కుదరలేదు. దాంతో వారు అక్కడ రామాలయంలో పూజలు చేయడాన్ని నిషేధించారు.
ఏటా నిర్వహించే జాతర కూడా  ఆపించేసారు.
చివరికి గుడికి తాళం కూడా వేసేసారు. కనీసం దర్శనం చేసుకునే అవకాశమైనా లేకుండా
చేసేసారు.

అలా రెండు దశాబ్దాల పాటు రామయ్యను మావోయిస్టులు
బందీని చేసేసారు. ఆలయంలో కనీసం దీపం, ధూపం, నైవేద్యం పెట్టే అవకాశం లేకుండా
చేసారు. చివరికి ఆ పరిస్థితి 2023లో మారింది.

2023 మార్చి 14న సీఆర్‌పీఎఫ్ 74వ బెటాలియన్, లఖాపాల్-కేర్లాపేండా
గ్రామాల సమీపంలో క్యాంప్ ఏర్పాటు చేసుకుంది. వాళ్ళు ఆ అమాయక గ్రామస్తుల మనసులను
గెలుచుకునే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో, అక్కడ పాడుబడి ఉన్న రామాలయాన్ని గుర్తించారు.
ఆ గుడి చరిత్ర స్థానిక గ్రామస్తులనుంచి తెలుసుకున్నారు. దాన్ని పునరుద్ధరించే
కార్యక్రమం చేపట్టారు.

ముందుగా స్థానిక అధికారులు, జవాన్లు గ్రామస్తులతో
కలిసి ఆ ప్రాంతంలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయం పరిసరాలను శుభ్రం
చేసారు.

‘‘ఇక్కడ సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ క్యాంపు ఏర్పాటు
చేయడంతో గ్రామీణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. వాళ్ళు గుడిని పునరుద్ధరించాలంటూ మమ్మల్ని
కోరారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని మేం ముందుగా ఆ ప్రాంతాన్ని శుభ్రం
చేసాం. గుడిని బాగుచేసాం. దాంతో గ్రామస్తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఒక మంచిరోజు
చూసుకుని గుడిని వారికి అప్పగించాం. ముందు ఒకపూట దీపం పెట్టడం మొదలుపెట్టారు.
క్రమంగా అన్నిరకాల పూజలూ మొదలయ్యాయి. కొన్నాళ్ళు గడిచేసరికి సాయంత్రం పూట కూడా
మహిళలు, పిల్లలు వచ్చి భజనలు, పూజాకార్యక్రమాలు చేయడం ప్రారంభమైంది. మొత్తం మీద
గ్రామంలో సానుకూల వాతావరణం నెలకొంది. ఇక అక్కడ అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడమే
మా పని’’ అని బెటాలియన్ కమాండెంట్ హిమాన్షు పాండే చెప్పారు.

ఎట్టకేలకు రామయ్యకు
21ఏళ్ళ మావోయిస్టుల చెర వీడిందని గ్రామస్తులు ఆనందిస్తున్నారు.

Tags: 21 years of LockChattisgarhMaoistsRam TempleSukma district
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.