ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలోని మొత్తం 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి ప్రకటించారు. ముందుగా వైఎస్ సమాధికి సీఎం జగన్ నివాళులర్పించారు. అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు 25ఎంపీ, 175 ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు చదివారు. ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సగం సీట్లు కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటికే 11 జాబితాల ద్వారా 73 పేర్లు ప్రకటించిన వైసీపీ, ఇవాళ వాటితో కలిపి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి స్థాన చలనం కలిగింది. కొందరు ఎంపీలు, అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్కు అనూహ్యంగా గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఇక కొడాలి నాని, మంత్రి రోజా, అంబటి రాంబాబు వారి వారి స్థానాలను దక్కించుకున్నారు.