సనాతన
ధర్మంపై తరుచూ అనుచిత వ్యాఖ్యల చేస్తోన్న కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ రాజాకు
బీజేపీ నేతలు తగు స్థాయిలో బదులిస్తున్నారు. రాజా
వ్యాఖ్యలను ఆయన పార్టీ డీఎంకే సనాతన ధర్మ వ్యతిరేక వైఖరిని తూర్పార బడుతున్నారు. ఓట్ల కోసం
దేశాన్ని, సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందూ దేవతలు,
సనాతన ధర్మం గురించి విమర్శలు చేసే డీఎంకే నేతల ఇతర మతాలలోని తప్పులు గురించి
ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
బీజేపీ
నినాదాలైన భరతమాతాకి జై , జై శ్రీరామ్ ను
తమిళనాడు ఎప్పటికీ స్వీకరించదంటూ డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యానించారు. భారత్ ఉపఖండమని భాష్యం చెప్పిన రాజా, ఒకే
దేశమైతే ఒకే భాష ఎందుకు లేదని ప్రశ్నించారు.
మధురైలో
డీఎంకే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజా, రాముడి గురించి, రామాయణం గురించి
తనకు తెలియదని, నమ్మకం కూడా లేదన్నారు. ఒకే, భాష, ఏకరకమైన సంస్కృతి లేనప్పుడు
భారత్ , దేశం ఎలా అవుతుందన్నారు.
బీజేపీ
కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగమే ఉండదంటూ వ్యాఖ్యానించారు.
అప్పుడు దేశం మనుగడ కోల్పోవడంతో పాటు భారత్ నుంచి తమిళనాడు విడిపోతుందని పిచ్చి
వ్యాఖ్యలు చేశారు.
రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విద్వేషపూరిత ప్రసంగం
చేసిన రాజాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా
డీఎంకే పనిచేస్తుందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.
సనాతన
ధర్మాన్ని తక్కువ చేస్తూ తరుచూ వ్యాఖ్యలు చేసే ఏ. రాజా మరో అడుగు ముందుకు వేసి మొత్తం
దేశాన్నే అవమానించేలా మాట్లాడటం సిగ్గు చేటు అని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు
అన్నామలై అన్నారు.
జై శ్రీరామ్, భారతమాతాకి జై నినాదాలపై కట్టుకథలు, తప్పుడు
భాష్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. డీఎంకే నేతల చేష్టలతో ప్రతీ
భారతీయుడు బాధపడుతున్నాడన్నారు.
రాజా
చేసిన వ్యాఖ్యలపై డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా స్పందించింది. రాజా
వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు తెలిపిన కాంగ్రెస్, మాట్లాడేప్పుడు సంయమనం
పాటించాలని సూచించింది.