తృణమూల్
కాంగ్రెస్(TMC) పాలనలో పశ్చిమ బెంగాల్ మహిళలు చిత్రవధ
అనుభవిస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్న
ప్రధాని మోదీ, మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను
తప్పుబట్టారు.
కలకత్తాలో దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో ప్రారంభించి ప్రయాణించిన
మోదీ, అనంతరం ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన మహిళాశక్తి
ర్యాలీలో పాల్గొన్నారు.
సందేశ్
ఖాలీ ఘటనతో ప్రతీ ఒక్కరూ సిగ్గుపడాలన్న ప్రధాని మోదీ,
నిందితులను కాపాడేందుకు టీఎంసీ ప్రభుత్వం
శాయశక్తులా ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి మమతా ప్రభుత్వం చివాట్లు తిన్నవిషయాన్ని ప్రధాని
గుర్తు చేశారు.
బీజేపీ
నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం అత్యాచారాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు
పడేలా చట్టాలు తీసుకొచ్చిందని వివరించారు. మహిళల సమస్యల పరిష్కారం, ఫిర్యాదుల
స్వీకరణకు కేంద్రం ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్లైన్ను టీఎంసీ ప్రభుత్వం నిర్వీర్యం
చేసిందన్నారు. మహిళల సంక్షేమం కోసం టీఎంసీ ప్రభుత్వ ఏనాడు పనిచేయలేదన్నారు.
బెంగాల్
పర్యటనలో భాగంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను మోదీ, ప్రస్తావించారు.
తనకు కుటుంబం లేదని లాలూ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా దేశమంతా తన కుటుంబమేనన్నారు.
చిన్నవయస్సులోనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినప్పటికి ఏనాడు పస్తులు ఉండలేదన్నారు. పేదలే
తనకు ఆశ్రయం ఇచ్చారని నాటి స్మృతులు గుర్తు చేసుకున్నారు. తన జీవితం, దేశం కోసమే
అంకితమని మరోసారి ప్రకటించారు. తనకు సమస్య వస్తే మహిళలే రక్షణ కవచంలా
నిలిచారన్నారు.