మంత్రి,
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం, వైసీపీకి భారీ షాక్
ఇచ్చారు. మంత్రి పదవితో పాటు, ఎమ్మెల్యే, పార్టీ పదవులుకు రాజీనామా చేసిన
గుమ్మనూరు జయరాం, టీడీపీ లో చేరనున్నారు. గుంతకల్ నియోజకవర్గం నుంచి సైకిల్
గుర్తుపై అసెంబ్లీ కి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ-జనసేన
కూటమి ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగే బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు సమక్షంలో
జయరాం, టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి ఆలూరు
నుంచి విజయవాడకు జయరాం ఇప్పటికే చేరుకున్నారు.
వచ్చే
ఎన్నికల్లో ఆలూరు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ నిరాకరించారు. ఎమ్మెల్యేకు
బదులు కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ఆదేశించారు. ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్న జయరాం, కొన్నాళ్ళుగా
వైసీపీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
12
ఏళ్ళ నుంచి వైసీపీ జెండా మోశానని చెప్పిన జయరాం, ఆలూరు ప్రజల మనోభావాలకు
అనుగుణంగానే ఆ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తన స్వగ్రామం గుంతకల్ కు దగ్గరగా
ఉండటంతో ఈ సారి టీడీపీ తరఫున అక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. ఎంపీగా పోటీ చేయడం
తనకు ఇష్టం లేదన్నారు.
సీఎం జగన్ పై గుమ్మనూరు జయరాం తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ విగ్రహం మాధిరిగా మారపోయారని ఆరోపించారు. సజ్జల, ధనంజయరెడ్డి పూజారులుగా వ్యవహరిస్తున్నారన్నారు.
పూజారులు, తమ బిడ్డలకు న్యాయం చేస్తూ భక్తులను
పట్టించుకోక పోవడంతో తాను పార్టీ
మారుతున్నట్లు తెలిపారు.