చదువుకోవాలంటూ సూచించినందుకు స్టడీ అవర్ ఇంఛార్జిగా ఉన్న డిగ్రీ విద్యార్థి వెంకట్ను ఇంటర్మీడియట్ విద్యార్థులు దారుణంగా చంపారు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ బీసీ హాస్టల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బోధన్ బీసీ హాస్టల్కు డిగ్రీ విద్యార్థి వెంకట్ స్టడీ అవర్ ఇంఛార్జిగా చేస్తున్నాడు. ఆదివారం కొందరు ఇంటర్ విద్యార్థులు చిట్చాట్ చేసుకుంటున్నారు. ముచ్చట్లు ఆపేసి చదువుకోవాలని వెంకట్ వారికి సూచించారు. అది నచ్చని ఆరుగురు విద్యార్థులు అర్థరాత్రి నిద్రిస్తోన్న వెంకట్పై దాడి చేశారు. ఊపిరాడకుండా చేసి చంపేశారు. పెనుగులాటలో శబ్దం రావడంతో తోటి విద్యార్థులు నిద్ర లేచారు.అనంతరం ఆరుగురు విద్యార్ధులు అక్కడ నుంచి పారిపోయారు. వెంకట్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఎట్టకేలకు ఆరుగురు విద్యార్థులను పోలీసులు పట్టుకుని, విచారణ జరుపుతున్నారు.