పశ్చిమ
ఆఫ్రికా లోని ఐవరీ
కోస్ట్ అబిడ్జన్లో
భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. కోట్ డిలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.
సంజయ్
గోయల్ అనే వ్యక్తి భార్య సంతోష్ గోయల్ తో
కలిసి దిల్లీ నుంచి ఐవరీ కోస్ట్కు పయనం అయ్యాడు.
ఇథియోపియాలో దిగిన వారిని తదుపరి విమానం నుంచి
డీబోర్డు చేసినట్లు కుమారుడు కరణ్ గోయల్ ఫిబ్రవరి 27న సంబంధిత ఎయిర్లైన్స్కు ఫిర్యాదు
చేశారు. తన తల్లిదండ్రులను ఎందుకు డీబోర్డు చేశారో తెలియదన్నారు.
గోయల్ దంపతులు మృతి చెందినట్లు తాజాగా
ఐవరీకోస్ట్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వారి కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. దంపతుల మృతికి
కారణాలను తెలుసుకునేందుకు స్థానిక యంత్రాంగంతో మాట్లాడుతున్నట్లు పేర్కొంది.