Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home సైన్స్ అండ్ టెక్నాలజీ

కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ : కేంద్ర క్యాబినెట్ ఆమోదం

param by param
May 12, 2024, 07:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీఎం సూర్య ఘర్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలో కోటి ఇళ్లకు రాయితీపై సోలార్ విద్యుత్ పరికరాలు అందించనున్నారు. నెలకు కనీసం 300 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. రూ.75,021 కోట్లతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా సోలార్ పరికరాల తయారీ పరిశ్రమకు, దాని అనుబంధ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని, తద్వారా 17 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. మూడు కిలో వాట్ల వరకు కేంద్రం రాయితీ (pm solar ghar) అందిస్తుంది. ఒక్కో కిలోవాట్‌కు 30 వేల చొప్పున, మొదటి 2 కిలోవాట్లకు రూ.60 వేల రాయితీ అందిస్తారు. 3 కిలోవాట్ల యూనిట్లకు రూ.78వేల రాయితీ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ పథకం కింద వినియోగదారులకు దాదాపు 50 శాతం రాయితీ అందుతుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా కనీస వడ్డీ రేటుకు అంటే కేవలం 7 శాతం వడ్డీకి రుణం మంజూరు చేస్తారు. ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని కూడా అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానెళ్ల ద్వారా 30 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.వినియోగదారులు తమకు అవసరమైన విద్యుత్ వాడుకుని మిగిలింది గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయం పొందవచ్చు. ఈ పథకం పూర్తైతే ఏటా 720 మిలియన్ టన్నుల కాలుష్యం తగ్గనుందని అంచనా.

Tags: andhratodaynewspm surya gharsolar energysolar mission
ShareTweetSendShare

Related News

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం
Latest News

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.