బాంబుల
మోతతో పాకిస్తాన్ దద్దరిల్లింది. ఆ దేశంలో రేపు ఎన్నికలు జరుగుతుండగా నేడు బాంబు
పేలుళ్ళు జరగడంతో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి దాపురించింది.
బెలూచిస్తాన్ ప్రాంత పరిధిలో పేలుళ్ళు జరిగి 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు
కోల్పోగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల
ఆఫీసుల వద్దే ఈ మారణ హోమం జరిగింది.
షిపిన్
జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం బయట మొదటి పేలుడు సంభవించగా 12 మంది
చనిపోయారు. కొద్దిసేపటి వ్యవధిలోనే ఖిల్లా
సైఫుల్లా పట్టణంలోని జామియత్ ఉలేమా ఇస్లామ్ పార్టీ కార్యాలయం వద్ద బాంబు పేలింది.
పాకిస్తాన్
లో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని
ముస్లిం లీగ్ (ఎన్), జైలు జీవితం అనుభవిస్తున్న మరో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ కూడా పోటీ లో ఉంది.