అండర్
19 క్రికెట్ ప్రపంచకప్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో యువభారత్ జట్టు
తలపడుతోంది. బెనోనీ (Benoni) లోని విల్లోమూర్పార్క్(Willowmoore Park) వేదికగా ఇరు జట్ల మధ్య సెమీస్ పోరు
జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, దక్షిణాఫ్రికా జట్టు 50
ఓవర్లు ఆడి ఏడు వికెట్లు నష్టపోయి 244 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా
ఓపెనర్ లువాన్ డ్రే ప్రెటోరియస్ 102 బంతుల్లో 72 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 118
పరుగుల వద్ద మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ముషీర్ ఖాన్ వేసిన 30.2 బంతిని మురగన్ అభిషేక్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
మరో ఓపెనర్ స్టీవ్ స్టాక్ కూడా క్యాచ్ ఔట్
గానే వెనుదిరిగాడు. రాజ్ లింబానీ బౌలింగ్ లో ఆరవెల్లి అవినాశ్ కు క్యాచ్ గా దొరికిపోయాడు.
17 బంతులు ఆడి 14 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్
నష్టపోయింది.
ఆ తర్వాత డేవిడ్ టేగేర్, రాంజ్ లింబానీ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. 40 వ ఓవర్ లో ఆలివర్ వైట్హెడ్ కూడా ఔట్ కావడంతో
దక్షిణాఫ్రికా 163 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. ఆ తర్వా సౌమీ పాండే
వేసిన 42.2 బంతిని ఆడి డేవాన్ మారిస్ (3) ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 174 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా
ఆడిన రిచర్డ్ సెలెట్ స్వేన్(64) 46.3 బంతికి వెనుదిరిగాడు. వందబంతుల్లో రిచర్డ్ 64
పరుగులు సాధించి జట్టు స్కోర్ లో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
తర్వాతి
ఓవర్ లో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కూడా సమర్పించింది. కెప్టెన్ జూవాన్ జేమ్స్, 19
బంతుల్లో 24 పరుగులు చేసి రాజ్ లింబానీ బౌలింగ్ లో వికెట్ కోల్పోయాడు. ట్రిస్టన్ లూస్( 12 బంతుల్లో 23), రిలే నార్టన్(7)
నాటౌట్ గా ఉన్నారు.
రాజ్
లింబానీ మూడు వికెట్లు తీయగా ముషీర్ ఖాన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. నమన్
తివారీ, సౌమీ పాండే చెరో వికెట్ తీశారు.