ఫ్లిప్కార్ట్ తో ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్
అధికారికంగా తెగతెంపులు చేసుకున్నాడు. ఆయన ప్రారంభించిన కొత్త వెంచర్ విషయంలో బోర్డు సభ్యులతో విభేదాలు పొడచూపడంతో
రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని బోర్డు సభ్యులకు వారం ముందే తెలిపిన
బిన్నీ, నేడు రాతపూర్వకంగా అందజేశారు. కంపెనీలోని
తన వాటాను వాల్ మార్ట్ కు విక్రయించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
సచిన్
బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి 2007లో బెంగళూరు వేదికగా ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్
కంపెనీని స్థాపించారు.
నవీ
అనే ఫిన్ టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని ఏళ్ల కిందట ఫ్లిప్ కార్డ్ ను
విడిచిపెట్టిన సచిన్ బన్సాల్ వలే ఇతను
కూడా కొత్త వెంచర్ ఏర్పాటు చేసుకున్నాడు.
బన్నీ
బన్సల్ జనవరి 2 OppDoor పేరిట ఈ- కామర్స్ స్టార్టప్
ప్రారంభించారు. ఈ కామర్స్ కంపెనీలు ప్రపంచవ్యాప్త మార్కెట్లో నిలదొక్కుకునేందుకు
అవసరమైన సేవలను ఈ వెంచర్ అందిస్తారు.
గత
16 ఏళ్ళగా ఫ్లిప్ కార్డు సాధించిన విజయాలకు గర్వపడుతున్నట్లు తెలిపిన బిన్నీ బన్సల్, కంపెనీ ప్రస్తుతం పటిష్ఠంగా ఉందన్నారు.
కంపెనీకి మంచి నాయకత్వం, స్పష్టమైన లక్ష్యం ఉన్నందునే తాను ఫ్లిప్ కార్టు నుంచి
వైదొలుగుతున్నట్లు వివరించారు.
బిన్నీ,
ఫ్లిప్ కార్డు నుంచి నిష్క్రమించడంపై ఆ కంపెనీ సీఈవో, బోర్డు సభ్యుడు కళ్యాణ్
కృష్ణమూర్తి స్పందించారు. బిన్నీ అనుభవం, వ్యాపార మెళుకువులు అమూల్యమైనవి అన్నారు.
బిన్నీ తదుపరి ప్రాజెక్టులో ప్రారంభిస్తున్నందును శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.