అయోధ్యలో రామాలయం సాకారమైంది. లక్షలాది మంది భక్తితో రాములోరికి అందించిన విరాళాతో దేవాలయం నిర్మించారు.దాదాపు 13 కోట్ల మంది విరాళాలు సమర్పించారు. అత్యధికంగా దిలీప్ కుమార్ వి లాఖి అనే వజ్రాల వ్యాపారి ఏకంగా రామాలయానికి 101 కేజీల బంగారం సమర్పించారు. దీని విలువ ప్రస్తుతం రూ.68 కోట్లు. అత్యధిక విరాళం (ayodya ram temple donations) ఇచ్చిన వ్యక్తిగా దిలీప్ కుమార్ నిలిచారు. ఆయన సమర్పించిన బంగారంతో రామాలయం తలుపులు, గర్భగుడి తాపడం, త్రిశూలం, డమరు, పిల్లర్లకు బంగారుపూత వేయించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్ బాపూ రూ.11.3 కోట్లు విరాళం ఇచ్చారు. విదేశాల్లోని భక్తులు మరో రూ.8 కోట్లు అందించారు. గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్ ఢోలాకియా రూ.11 కోట్లు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ఓ సాధారణ వ్యకి కోటి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చాడట. తనకు ఉన్న 16 ఎకరాలు అమ్మినా కేవలం రూ.85 లక్షలు మాత్రమే వచ్చాయి. మరో రూ.15 లక్షలు అప్పు చేసి కోటి అందించారు.
దేశ వ్యాప్తంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ్ ట్రస్టు విరాళాలు సేకరించింది. ఇందుకు 20 లక్షల మంది కార్యకర్తలు పనిచేశారు. 12.7 కోట్ల మంది నుంచి రూ.2100 కోట్లు సేకరించారు.