అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని తెలంగాణలోని భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములవారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలు ఉంచి అర్చన చేశారు. ఆ తరవాత ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. శ్రీరామ రథంతో భద్రాచలం (bhadrachalam ramalayam) పట్టణంలో రథయాత్ర నిర్వహించారు. వేలాది మంది రామ భక్తులు రథయాత్రకు తరలివచ్చారు.
వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, హరిరామ కీర్తనలతో స్వామి వారి రథాన్ని పట్టణంలో ఊరేగించారు. ఈ శోభాయాత్ర దాదాపు 6 కి.మీ సాగింది. శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భద్రాచలం పట్టణం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయింది.