అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ (ayodya ramalaya pran pratistha)వేళ కళాకారులు వివిధ రూపాల్లో వారి భక్తిని చాటుకుంటున్నారు. ఒడిషాలోని ఓ కళాకారుడు కేవలం అగ్గిపుల్లలతో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించాడు. అగ్గిపుల్లలతో కళాకారుడు శాశ్వత్ రంజన్ రూపొందించిన అయోధ్య రామమందిర నమూనా పలువురిని ఆకట్టుకుంటోంది.
ఆరు రోజులు కష్టపడి, 936 అగ్గిపుల్లలతో శిల్పి శాశ్వత్ రంజన్ ఈ నమూనా తయారు చేశాడు. రామమందిర ప్రతిరూపం 14 అంగుళాల పొడవు, ఏడు అడుగుల వెడల్పు ఉంది. ఈ నమూనాను ప్రధాని మోదీకి బహుకరిస్తానని రంజన్ తెలిపారు. అందుకు ఎవరైనా సహకరించాలని అభ్యర్థించాడు. మరికాసేపట్లో అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన 7 వేల మంది ముఖ్య అతిథులుగా పాల్గోనున్నారు.ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా మంగళధ్వని పేరుతో సంగీత కార్యక్రమం నిర్వహించారు.