అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ తరవాత దేశంలో రామ రాజ్యం మొదలవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పష్టం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ నుంచి రామరాజ్యం (ayodya ramalaya pran prathistha) మొదలవుతుంది ఆయన ఆకాంక్షించారు. దేశంలో ఇక నుంచి అసమతుల్యతలు తొలగిపోతాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమతో జీవిస్తారని, అయోధ్య నుంచి అది దేశమంతా వ్యాపిస్తుందన్నారు. అది చాలా సుందరంగా ఉంటుందని దాస్ అభిప్రాయపడ్డారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తరవాత ప్రతి ఒక్కరు మతసామరస్యం ప్రత్యక్షంగా చూస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరికి రాములోరి ఆశీస్సులందుతాయన్నారు.
‘‘అంతే మంచే జరుగుతుంది.కోట్లాది రామభక్తుల కల ఇవాళ నెరవేరుతుంది. కొన్ని నిమిషాల్లో రామ్ లల్లా ప్రతిష్ఠ జరుగుతుంది. అన్ని కష్టాలు తొలగిపోతాయి’’అయోధ్య చరిత్రలో నిలిచిపోతుందని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ప్రారంభమై, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అంటే మృగశిర నక్షత్రంలో ప్రాణ ప్రతిష్ట జరగనుందని దాస్ గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ పూజలన్నీ నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వేలాది మంది ప్రముఖులు ఈ అపూర్వ ఘట్టం వీక్షించేందుకు హాజరవుతున్నారు. ఇప్పటికే వారంతా అయోధ్య చేరుకున్నారు.