తుపాను
కారణంగా ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలపరిధిలో పర్యటించిన పురందరేశ్వరి,
రైతులను పరామర్శించారు. తడిచిన పంటను పరిశీలించారు.
రాష్ట్రమంత్రులు
ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించలేదని ప్రశ్నించిన పురందరేశ్వరి, రైతుభరోసా
కేంద్రాలు నామమాత్రంగా తయారు అయ్యాయని విమర్శించారు.
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు
రూ. 50 వేలు తక్షణ సాయం కింద అందజేయాలని కోరారు. తడిసిన, రంగుమారిన ప్రతీగింజను
ప్రభుత్వం కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గోనె సంచులు సరఫరాలో జరుగుతున్న
జాప్యాన్ని నివారించాలన్నారు.
పర్యటనలో భాగంగా చేబ్రోలులో రైతుభరోసా కేంద్రానికి
వెళ్ళి పంట నష్ట వివరాలపై అధికారులను ప్రశ్నించారు. అధికారులు సరైన వివరాలు
వెల్లడించలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కాల్వల ఆధునికీకరణ పనులు చేయకుండా తాత్సారం చేయడంతో వరద ముప్పు పెరిగిందన్నారు.
రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం గౌరవంగా వ్యవహరించడంలేదని విమర్శించారు.