తెలంగాణ
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి నిర్ణయాన్ని వెల్లడించేందుకు కాంగ్రెస్ అధిష్టానం
మల్లగుల్లాలు పడుతోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన కాంగ్రెస్
ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును
సూచించినట్లు తెలుస్తోంది.
ఈ
సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి
మాణిక్ రావు ఠాక్రే హాజరయ్యారు.
సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన
నేపథ్యంలో, డీకే
శివకుమార్ సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. సీఎల్పీ సమావేశంలో సీఎం పేరును ప్రకటించనున్నారు.
పీసీసీ
చీప్ గా ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారని ఆయనే
సీఎంగా ఉండాలని పులువురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు అభిప్రాయం వ్యక్తం
చేశారు. అయితే కాంగ్రెస్ లోని మరో వర్గం నేతలు రేవంత్ అభ్యర్థిత్వాన్ని
వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం
దృష్టిసారించింది.
రేవంత్
రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థుల
గెలవలేకపోవడంతో పాటు ఆయన పై ఉన్న కేసుల విషయాన్ని కాంగ్రెస్ సీనియర్లు
లేవనెత్తారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్,
సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా, రేవంత్ అభ్యర్థిత్వాన్ని
వ్యతిరేకించినట్లు వార్తలొచ్చాయి.
కాంగ్రెస్
నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల్లో 42 మంది రేవంత్ రెడ్డి కి విధేయులని ఆయన
సానుభూతిపరులు చెబుతున్నారు.