రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (riserve bank of india)రూ.2వేల నోట్ల చలామణి రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సెప్టెంబరు 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తరవాత మరో వారం గడువు పెంచి రిజర్వ్ బ్యాంక్ మరో అవకాశం కల్పించింది. గడవు పొడగించిన తరవాత కూడా ఆర్వీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే సదుపాయం కల్పించింది. అయినా రూ.9600 నేటికీ ఆర్బీఐకి చేరకపోవడం గమనార్హం.
మొత్తం 2 వేల నోట్లలో 97.26 శాతం మాత్రమే బ్యాంకులకు చేరాయి. ఇంకా 2.74 శాతం బ్యాంకులకు చేరలేదు. వీటి విలువ రూ.9600 కోట్లుగా ఉంటుందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. బ్లాక్ మనీ బ్యాంకులకు చేరలేదని, ఉగ్రవాదులు, విదేశాలకు తరలించిన డబ్బు బ్యాంకుల్లో జమచేయలేదని భావిస్తున్నారు. మొత్తం 3.56 లక్షల కోట్ల విలువైన 2 వేల నోట్లు బ్యాంకుల్లో మార్చుకున్నారు. బ్యాంకులకు చేరని డబ్బుపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.