voting underway
in 119 seats:
తెలంగాణ
వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 119 స్థానాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తుండగా
ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా,
3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
పోటీ
చేస్తున్న వారిలో గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు 103 మంది ఉండగా అందులో ఎక్కువ
మంది బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
35,
655 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
వికలాంగులు, 80ఏళ్ళ వయస్సు పైబడిన వృద్ధులు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే అవకాశం
కల్పించారు. 27,600 మంది ఓటర్లు ఈ కేటగిరిలో ఉన్నారు
ఈసారి 18 నుంచి 19 ఏళ్ళ వయసున్న 9,99,667 మంది ఓటర్లు
తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా 75 వేల మంది పోలీసు
బలగాలను రంగంలోకి దింపారు. తెలంగాణకు చెందిన 40 వేల మంది, సరిహద్దు రాష్ట్రాలకు చెందిన 15 వేల మంది పోలీసులు, 375 కంపెనీల
కేంద్ర సాయుధ బలగాలు ఎన్నికల విధుల్లో
ఉన్నాయి.
మొదటి
రెండు గంటల్లో అంటే ఉదయం 9 గంటలకు 7.78 శాతం ఓటింగ్ నమోదు అయింది.
సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నెం.118 లో ఈవీఎం
మొరాయించింది. మాక్ పోలింగ్ సజావుగా సాగినా,
పోలింగ్ ప్రారంభమయ్యాక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేట మండల కేంద్రంలో ఉన్న 167 నెం.పోలింగ్ బూత్, సూర్యాపేట జిల్లా
కేంద్రంలోని విద్యానగర్ బూత్ నెంబర్ 89,
నాగార్జునసాగర్ 103 నెం.పోలింగ్ బూత్లో ఈవీఎంల కారణంగా
ఆటంకాలు ఎదురయ్యాయి.
పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించుకన్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి ఓటు వేశారు. హీరో ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్
లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లో ఓటు వేశారు. అల్లు అర్జున్, జూబ్లీ హిల్స్
లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. షాద్ నగర్ లో
ప్రకాశ్ రాజ్ ఓటు వేశారు.
తెలంగాణ ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు వేసి
ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. యువత,
ముఖ్యంగా మొదటి సారి ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం
ముగుస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్
ముగియనుంది.ఇప్పటికే పోలింగ్ పూర్తైన రాజస్థాన్, చత్తీస్ గఢ్ ,
మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలతో పాటూ
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబర్ 3న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.