దేశీయ స్టాక్ సూచీలు (stock market ) అనూహ్య లాభాలార్జించాయి. ఉదయం ప్రారంభంలోనే లాభాలతో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీ, మార్కెట్ ముగిసే సమయానికి భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 727 పాయింట్ల లాభంతో 66901 వద్ద ముగిసింది. నిఫ్టీ 206 పాయింట్లు పెరిగి 20096 వద్ద క్లోజైంది. తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల మూలధనం విలువ 4 లక్షల కోట్ల డాలర్లను దాటింది.
సెన్సెక్స్ 30లో నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు మాత్రమే నష్టాలను చవిచూశాయి. విప్రో, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలార్జించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి.