Union cabinet approves: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్
సమయంలో పేదల కోసం ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకం మరో ఐదేళ్ళు కొనసాగనుంది.
ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ
సమావేశం ఆమోదం తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే దాదాపు 80
కోట్ల మంది ప్రజలకు వచ్చే ఐదేళ్ళ పాటు ఈ పథకం కింద రేషన్ అందజేస్తారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన(PMGKAY) పథకం
గడవు ఈ ఏడాది డిసెంబరు31తో ముగియనుంది. దీంతో మరో ఐదేళ్లు ఈ పథకాన్ని పొడిగిస్తామని
ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ జరిగిన కేంద్ర
కేబినెట్ ఈ పథకాన్ని 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ళ పాటు పొడిగిస్తున్నట్లు
వెల్లడించింది.
నెలవారీ రేషన్ తో పాటు మరో ఐదు కేజీల
బియ్యం, గోదుములలో ఏదైన ఒక ధాన్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. అదనపు సాయం కింద
కందిపప్పు కూడా ఈ పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్నారు.
2020 ఏప్రిల్ లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.
మూడు నెలల కాలానికి మాత్రమే దీనిని ప్రకటించినప్పటికీ ఏడుదశాలుగా ఈ సాయాన్ని
పొడిగించారు.
దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం
సహాయక బృందాలకు డ్రోన్లను అందించాలని కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వీటి
ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ ఆధారిత సేవలు
అందించాల్సి ఉంటుంది.