China pneumonia scare: కరోనా
వ్యాప్తిని తొలినాళ్ళలోనే అరికట్టలేకపోయిన చైనా, తనతో పాటు మొత్తం ప్రపంచాన్నే కుదేలు
చేసింది. కరోనా ముప్పు తొలిగిపోయింది అనుకునే లోపు ఆదేశాన్ని మరో సమస్య వెంటాడుతోంది.
చైనాలోని
చిన్నారులు శ్వాసకోస ఇన్పెక్షన్లతో
బాధపడుతున్నారు. ఈ అనారోగ్య సమస్య ప్రబలడానికి కారణాలు ఇంకా తెలియలేదు. దీంతో
చైనాతోపాటు ప్రపంచ దేశాలు కలవరం చెందుతున్నాయి.
చైనాలో
పరిస్థితులపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజారోగ్య సంరక్షణ, ఆస్పత్రుల
సంసిద్ధతపై తక్షణమే సమీక్ష చేయాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఔషధాలు, ఆక్సిజన్,
పీపీఈ, టెస్టు కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది. దీంతోశ్వాసకోస సంబంధిత
సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ పలు రాష్ట్రాలు వైద్య సిబ్బందిని అప్రమత్తం
చేశాయి.
సీజనల్
ప్లూ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన కర్ణాటక ప్రభుత్వం, తుమ్ము, దగ్గు
వచ్చినప్ప్పుడు నోరు, ముక్కును కవర్
చేసుకోవాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపింది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని, పదే పదే ముఖాన్ని చేతితో తాకకుండా
ఉండటం మంచిదని సూచించింది.
శ్వాసకోస
సమస్యల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని
ఆదేశించిన రాజస్థాన్ ఆరోగ్య శాఖ, పిల్లల వైద్య విభాగంలో అన్ని వసతులు అందుబాటులో
ఉంచాలని పేర్కొంది.
ఉత్తరాఖండ్
లోని చమోలి, ఉత్తరకాశీ, పిఠోర్గఢ్ జిల్లాలు చైనాతో సరిహద్దు పంచుకుంటాయి. దీంతో
ఆయా జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. హర్యాణా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ
చేశాయి.