విశాఖ
మధురవాడ వాంబేకాలనీలో జరిగిన గ్యాస్ ప్రమాద ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.
ఘటనలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య నాలుగుకు చేరింది. ఒకే కుటుంబానికి చెందిన
నలుగురు మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదం వాతావరణం నెలకొంది.
బాలరాజు(60),
అతడి భార్య చిన్ని(55), పెద్దకుమారుడు గిరి(22) బుధవారం చనిపోగా, చిన్నకుమారుడు
కార్తిక్(21) రెండురోజుల క్రితమే మృతి చెందారు.
ఇంట్లో
సిలిండర్ కు రెగ్యులేటర్ అమర్చే క్రమంలో ప్రమాదం జరిగింది.
బాధితులను చికిత్స నిమిత్తం
ఆస్పత్రికి తరలించిగా ఒక్కొక్కరుగా ప్రాణాలు వదిలారు. దీంతో స్థానికంగా విషాదం
అలుముకుంది. తోటి వారి మరణంపై కాలనీవాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వారితో
ఉన్నపరిచయాన్ని తలుచుకుని రోదిస్తున్న ఘటనలు చూస్తుంటే మనసు చలించిపోతుంది.