2024
Elections Target : హోరాహోరీగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ
ఎన్నికల ప్రచారఅంకం ముగిసి ముగియగానే లోక్సభ ఎన్నికల సన్నాహాలపై భారతీయ జనతా
పార్టీ దృష్టిసారించింది. ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే సహచర కేంద్రమంత్రులకు
ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు.
2024లో
జరిగే లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రులకు
సూచించిన ప్రధాని మోదీ, భారత సంకల్పయాత్రలో క్రీయాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేంద్రం అమలు
చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మార్గనిర్దేశం చేశారు.
నియోజకవర్గాల్లో
చేపట్టే భారత సంకల్పయాత్రలో ఓటర్లతో నేరుగా మమేకం కావడంతో పాటు దిగువ స్థాయి
కార్యకర్తలను కులుపుకుపోవాలన్నారు. ముఖ్య అతిథి హోదాలో యాత్రల్లో తూతూమంత్రంగా
పాల్గొనడంతో ఉపయోగం ఉండదని, క్రీయాశీలకంగా కులుపుగోలుగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని
తేల్చి చెప్పారు.
పేదల
అభ్యున్నతి కోసం కేంద్రం అమలు చేస్తోన్న పథకాలు వివరాలను లబ్ధిదారులకు
వివరించేందుకు భారత సంకల్ప యాత్ర ఆఖరి ప్రయత్నమని దానిని సక్రమంగా వాడుకోవాలని హెచ్చరించారు.
ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించేందుకు భారత్ సంకల్పయాత్ర ఓ సదావకాశమన్నారు.
ప్రతీ
ఎన్నికల వాగ్దానాన్ని ఎన్డీయే ప్రభుత్వం నెరవేరుస్తోందనే భరోసా ప్రజల్లో కల్పించేందుకు
ఈ కార్యక్రమంలో కృషి చేయాలని మంత్రులకు ప్రధాని సూచించారు.
ఏడాది
కిందటే లోక్సభ ఎన్నికల గురించి వ్యూహారచన చేసిన ప్రధని మోదీ, అనుసరించాల్సిన
వ్యూహాలను ముఖ్యలకు వివరించారు.
యూనిఫామ్
సివిల్ కోడ్ ను బీజేపీ మేనిఫెస్టోలో పొందు పరచాలని భావిస్తున్న బీజేపీ, దీనిపై
ఇప్పటికే కార్యకర్తలకు అవగాహన కల్పించి ప్రజల్లో చర్చ జరిగేలా ప్రణాళిక వేసింది.
పార్లమెంటు
నియోజకవర్గాల వారీగా విజయ వ్యూహాన్ని అమలు చేస్తోన్న బీజేపీ, 543 ఎంపీ స్థానాలను
ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలుగా విభజించింది.
నార్త్
జోన్ లో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, జమ్ము-కశ్మీర్ తో పాటు పలు హిందీ బెల్టు
రాష్ట్రాలు ఉన్నాయి. ఈస్ట్ జోన్ లో పశ్చిమ బెంగాల్, బిహార్, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక సౌత్ జోన్ లో ఉంది.
వ్యవసాయశాఖ
ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో , సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పట్టణ
ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేశారు.
బీజేపీ
పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించే ప్రగతి ప్రదర్శనల కోసం థియేటర్ వ్యాన్ లు కూడా
వినియోగించబోతున్నారు. దాదాపు 2.55 లక్షల గ్రామాలు 18 వేల పట్టణ ప్రాంతాలు
అనుసంధానం చేస్తూ ప్రచారం సాగనుంది.
కేంద్రప్రభుత్వ
సంక్షేమ పథకాలు, ఉజ్వల, గృహా నిర్మాణ పథకాల గురించి ఈ ప్రదర్శనల్లో
వివరిస్తారు.
నవంబర్ 15న ప్రధాన నరేంద్ర
మోదీ ఈ యాత్రను జార్ఖండ్ లోని ఖుంతిలో ప్రారంభిచారు. జనవరి 25 వరకు దేశవ్యాప్తంగా
ఈ యాత్ర సాగుతుంది.
డిసెంబర్ 4 నుంచి మొదలయ్యే శీతాకాల సమావేశాల్లో
చురుకుగా వ్యవహరించాలని సహాచరులకు సూచించిన ప్రధాని, విపక్షాలు సంధించే ప్రశ్నలకు
ధీటుగా జవాబు ఇవ్వాలన్నారు.