దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (stock markets) భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం స్టాక్ మార్కెట్ సెక్సెక్స్ 343 పాయింట్ల లాభంతో 66517 వద్ద ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 19993 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తోన్న సానుకూల సంకేతాలతోపాటు, దేశీయ మార్కెట్లలోనూ విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.12 వద్ద మొదలైంది.
సెన్సెక్స్ 30లో సన్ఫార్మా, మారుతీ, పవర్ గ్రిడ్ నష్టాలను చవిచూడగా, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ టైటాన్ ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఫెడ్ వడ్డీ రేట్లు ఇప్పట్లో పెంచాల్సిన అవసరం లేదని అమెరికాకు చెందిన ఓ అధికారి మంగళవారం ప్రకటించారు. దీంతో ఐరోపా,అమెరికా మార్కెట్లు లాభాలను అందుకున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా ఇవాళ ప్రతికూలంగా మొదలయ్యాయి.