ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగం నుంచి 41 మంది కార్మికులు (trapped tunnel workers safe) ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తరకాశీ జిల్లాలో ఈనెల 12న సొరంగం కూలిపోవడంతో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అమెరికా నుంచి తీసుకు వచ్చిన డ్రిల్లింగ్ మెషీన్ కొంత దూరం తవ్విన తరవాత మెురాయించింది. దీంతో చివరకు బొరియలు చేసి బొగ్గు తవ్వుకునే కార్మికులను రంగంలోకి దింగాల్సి వచ్చింది.
ఎట్టకేలకు మంగళవారం రాత్రి 9 గంటలకు ఒక్కో కార్మికుడిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు, వారి కుటుంబ సభ్యులను కలసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కార్మికులను వెలికితీసిన సిబ్బందికి పాదాభివందనం చేశారు. సహాయక చర్యలు విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిబ్బందికి అభినందనలు తెలిపారు.