తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. నువ్వానేనా అన్నట్లుగా ప్రచారంలో
పాల్గొన్న అభ్యర్థులు, ప్రత్యర్థుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు యత్నించారు. ఓటర్లను
ఆకర్షించేందుకు దొరికిన ప్రతీఅవకాశాన్ని వినియోగించుకున్నారు.
ప్రధానపార్టీల
అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా వినూత్నరీతిలో ఓటర్ల మెప్పు
కోసం శ్రమించారు.
నేటి
సాయంత్రంతో ప్రచారసమయం ముగిసింది. ఎన్నికల సంఘం, అక్టోబర్ 9న షెడ్యూల్
ప్రకటించినప్పటి నుంచి ప్రచారపర్వం ఓ రేంజ్ లో సాగింది.
హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్
ప్రయత్నిస్తుండగా, అధికారం కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. తెలంగాణలో
పాలకపార్టీగా అవతరించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
119 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్లో ఎన్నికలు ఈ నెల 30న పోలింగ్,
డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.
ఎన్నికలు సందర్భంగా రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు
సెలువు ప్రకటించారు. వైన్స్ షాపులను కూడా రెండు రోజులు పాటు మూసివేయాలని ఆదేశాలు
జారీ అయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,375 ప్రాంతాల్లో
పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు.
65 వేల
మంది తెలంగాణ పోలీసులతో పాటు18 వేల మంది హోంగార్డులు ఉన్నారు.
రాష్ట్ర పోలీసులతో పాటు 375 కంపెనీల
కేంద్ర బలగాలు పాల్గొంటున్నాయి.
4,400 సమస్యాత్మక ప్రాంతాలను
అధికారులు గుర్తించారు. ఈ సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత
ప్రాంతాల్లో అదనపు బలగాల ద్వారా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.