Gold loan : దొంగ బంగారంతో బ్యాంకునే బురిడీ
కొట్టించిన ఘటన గుంటూరు లో వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారాన్ని
బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ మోసంలో బ్యాంకు అప్రైజరు ప్రమేయం
కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
నిజమైన
బంగారం తాకట్టు పెట్టిన వారికి అప్పుకు రెండురెట్లు అధికంగా చెల్లించాలంటూ నోటీసులు
పంపడంతో ఈ బాగోతం బట్టబయట పడింది. మొత్తం 107 మంది నకిలీ బంగారంతో రుణాలు
పొందినట్లు తెలిసింది.
నోటీసులపై
ప్రశ్నించినందుకు ఖాతాదారులను కూడా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులున్నాయి.
నల్లపాడు
సీఐ రాంబాబు తెలిపిన వివరాల మేరకు… గుంటూరు-అమరావతి రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్
ఆఫ్ ఇండియా గోరంట్ల బ్రాంచీలో ఆడిట్ నిర్వహించగా, వెండి వస్తువులకు బంగారు పూత
పూసి కోట్ల రూపాయల రుణం పొందినట్లు తేలింది.
బ్యాంక్
ఇంటర్నల్ అధికారి అనిల్ డెకాబె, బ్యాంకు రీజినల్ మేనేజర్ ధనరాజ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
2021
జనవరి 29 నుంచి 2023 నవంబరు 16 వరకు ఆడిట్ నిర్వహించగా 107 ఖాతాలలో నకిలీ బంగారంతో
రుణాలు పొందినట్లు గుర్తించారు. వీటిలో దాదాపు 100 ఖాతాలలో నకిలీ బంగారం పెట్టి
రుణం పొందే సమయంలో రీ అప్రైజల్ కూడా నిర్వహించలేదని గుర్తించారు. దాదాపు రూ. 2.71
కోట్ల బ్యాంకుకు టోకరా వేసినట్లు తేలింది.
లోన్
అప్లికేషన్, అప్రైజల్ తదితర పరిశీలనలు చేయకుండానే రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు.