తిరుమల ఆలయం (tirumala temple) ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, శ్రీవారి ఆలయాన్ని రక్షించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు. తిరుమల ఈవో హిందూ దేవాలయాలు, పురాతన సంప్రదాయాలను, టీడీపీ ఆస్తులను క్రమ పద్దతిలో నాశనం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్న వేళ ట్విట్టర్ వేదికగా రమణ దీక్షితులు ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.
రమణ దీక్షితులు గతంలో శ్రీవారి ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తిరుమల శ్రీవారి సేవలో ఉన్నారు. కొంత కాలం కిందట ఆయన పదవీ విమరణ చేశారు. తిరుమలలో చోటు చేసుకుంటోన్న అరాచకాలపై రమణ దీక్షితులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే మొదటిసారి కావడం గమనార్హం.