రైతుల
సమస్యల పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర
అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి విమర్శించారు. రైతులతో మాట్లాడేందుకు
మంత్రులు, ఉన్నతాధికారులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. 450 మండలాల్లో కరవు
పరిస్థితులు ఉంటే 103 మండలాలే అంటూ ప్రభుత్వం ప్రకటించడం సరికాదని హితవు పలికారు.
సీఎం సొంత జిల్లాలోనే కరవుతో రైతులు అల్లాడుతున్నారన్న కుమారస్వామి, అన్నమయ్య
ప్రాజెక్టు కొట్టుకుపోయినా ముఖ్యమంత్రి స్పందించలేదని దుయ్యబట్టారు.
అధికారులు
కూడా రాజకీయ నాయకులతో సమానంగా సీట్లకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. కాలువల
పూడికతీత చర్యలు చేపట్టకపోవడంతో సాగునీటి పంపిణీకి అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు.
రైతుల
సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28న రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని
ముట్టడిస్తామని వెల్లడించారు. నకిలీ విత్తనాలు, నకిలీ
పురుగు మందులు యథేచ్ఛగా అమ్ముతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని
ప్రశ్నించారు.