భూ
వివాదం కారణంగా ఓ యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాకినాడలో
చోటుచేసుకుంది. ఆస్తి విషయంలో మోసపోవడంతోనే గడ్డి మందు తాగి బలవన్మరణం చెందాడని
మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నున్న
శ్రీకిరణ్ చౌదరి(32) కాకినాడలోని అశోక్నగర్ నివాసి. ఓ భూ వివాద పరిష్కారం కోసం
వైసీపీ నేతలను సంప్రదించాడని వారు మోసం చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య
చేసుకున్నాడని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూ వివాద పరిస్కారం కోసం
వైసీపీ నేతలను ఆశ్రయిస్తే, భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకుని డబ్బురాదని
చెప్పారని, వారి బెదిరింపులతో తీవ్రంగా కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని
చెబుతున్నారు.
ఎమ్మెల్యే
కన్నబాబు సోదరుడు, సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, మరో అనుచరుడు పెదబాబు తమ
కుమారుడిని మోసం చేశారని శ్రీకరణ్ తల్లి రత్నం ఆరోపిస్తున్నారు.