బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రణ్దీప్ సూర్జేవాలా ఫిర్యాదు మేరకు ఈసీ(EC) నోటీసులు జారీ చేసింది.
టీ వర్క్స్లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్
కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సూర్జేవాలా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ
కేటీఆర్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
టీ వర్క్స్ భేటీలో విద్యార్థులతో
ముచ్చటించిన కేటీఆర్ పలు హామీ ఇచ్చారని టీఎస్పీఎస్సీ(TSPSC)ని ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు
భర్తీ చేస్తామని వాగ్దానం చేశారని అది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనంటూ
ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన… కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల
ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. మధ్యాహ్నం మూడు గంటల లోగా
వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది.