అసెంబ్లీ ఎన్నికల
వేళ తెలంగాణలో ఆదాయపు పన్ను అధికారులు జరుపుతున్న సోదాలు(IT Raids
Telangana
)
తీవ్ర కలకలకం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఐటీ సోదాలు
జరగుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇల్లు, కార్యాలయాలు, కింగ్స్ పంక్షన్
హాళ్లులో తనిఖీలు చేస్తున్నారు. కోహినూర్ రియల్ ఎస్టేట్ స్థిరాస్తి వ్యాపారి
ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో ఈ ఉదయం
నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జల్లా తాండూరులోని రోహిత్ రెడ్డి
నివాసంలో ఐటీ అధికారుల బృందం తనిఖీ చేపట్టి, పలు
రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 లక్షల నగదు కూడా సీజ్ చేయడంతో
పాటు ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గతంలో కేసీఆర్
ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసంలో కూడా శుక్రవారం
తనిఖీలు నిర్వహించారు.
గతంలో
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదాలు
నిర్వహించారు.