ఆటో
స్కూలు
విద్యార్థులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటన విశాఖపట్నం సంగం శరత్
థియేటర్ కూడలి వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా
గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు
విద్యార్థులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టి దూసుకెళ్ళింది. ఆటో మూడు పల్టీలు
కొట్టి ఎగిరిపడింది. ఆటోలోని ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారిని
స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
లారీ
డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు పట్టుకుని
పోలీసులకు అప్పగించారు. ఇదే తరహా ప్రమాదం మరొకటి కూడా చోటుచేసుకుంది. మధురవాడ-నగరపాలెం
రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడ్డారు. నగరపాలెం వైపు వస్తున్న ఆటో
అదుపు తప్పి బోల్తా కొట్టడంతో 8 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.