సొరంగం కూలి పోవడంతో 41 మంది కార్మికులు 170 గంటలుగా చిక్కుకుపోయారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపంలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.
వారం రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు (Workers stuck in Tunnel) స్వల్పంగా ఆహారం అందిస్తున్నారు. కూలిపోయిన సొరంగం కొండపై నుంచి నిలువుగా రంధ్రం చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయ అధికారుల బృందంతోపాటు, విదేశీ నిపుణులు కూడా పనిచేస్తున్నారు. వారికి రక్షించేందుకు ఐదు ప్రణాళికలను ఏక కాలంలో అమలు చేస్తున్నారు.
అందరి సమిష్టి కృషితో నాలుగైదు రోజుల్లో కార్మికులను రక్షించే అవకాశం ఉందని ప్రధాన మంత్రి మాజీ సలహాదారు భాస్కర ఖుల్బే తెలిపారు. దేవుడి దయ ఉంటే అంతకన్నా ముందే వారు బయటపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు డ్రిల్లింగ్ యంత్రం నుంచి భారీ శబ్ధం రావడంతో అధికారులు పనులు నిలిపేశారు. దీనిపై కేంద్రం ఒక ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించింది.
ఎన్హెచ్ఐడిసీఎల్ ఎండి మహమూద్ అహ్మదాస్ను కేంద్ర ప్రభుత్వం సమన్వయకర్తగా నియమించింది. దీర్ఘకాలం కార్మికులు సొరంగంలో చిక్కుకుపోవడంపై వారి మానసిన, శారీరక ఆరోగ్యంపై వైద్యులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ధర్నా