స్కిల్
డెవలప్మెంట్ కేసు( SKILL
CASE)లో అరెస్టై
మధ్యంతర బెయిల్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ (BAIL)పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ(AP CID) తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా, చంద్రబాబు
తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదించారు. ఇరువైపులా
వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
చంద్రబాబు మెడికల్ రిపోర్టులో తప్పులు
ఉన్నాయని ఏఏజీ పొన్నవోలు వాదించారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు చేతులు మార్చారని కోర్టుకు తెలిపారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా
హైదరాబాద్కు తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ల ద్వారా ఈ విషయం వెల్లడి అయిందన్నారు. బోస్, కన్వేల్కర్ మెసేజ్ల
ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసిందని, సీమెన్స్ వాళ్లే నిధుల
మళ్లింపు జరిగిందని నిర్ధారించారని ఏఏజీ వాదించారు.
ఎన్నికలు దగ్గర పడిన సమయంలో చంద్రబాబును
కావాలనే అరెస్టు చేశారని, బెయిల్ పై విచారణ జరుగుతున్న సమయంలో కేసు మూలాల్లోకి
వెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు.
2018 నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతుంటే ప్రస్తుతం ఎందుకు హడావుడి చేస్తున్నారని
కోర్టుకు వివరించారు.