సహారా గ్రూప్ సంస్థల ఛైర్మన్ సుబ్రతారాయ్ తీవ్ర అనారోగ్యంతో ముంబయిలో కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
1948 జూన్ 10న బిహార్లో జన్మించిన సుబ్రతా రాయ్…ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, అతిథ్య రంగాల్లో వ్యాపారాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకున్నారు.
సుబ్రతారాయ్ గోరఖ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తరువాత అనేక వ్యాపారాలు ప్రారంభించారు. 1976లో సహారా చిట్ఫండ్ (sahara group) కంపెనీ స్థాపించారు. 1978లో దాన్ని సహారా ఇండియా పరివార్గా మార్చి అనేక సంస్థలను స్థాపించారు. 1992లో రాష్ట్రీయ సహారా పేరుతో ఓ వార్తాపత్రిక, సహారా టీవీ ఛానల్ ప్రారంభించారు. తరవాత దాన్ని సహారా వన్గా మార్చారు. 2010లో లండన్లోని గ్రోస్వెనర్ హౌస్ హోటల్, 2012లో న్యూయార్క్లోని ప్లాజా హోటల్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
2000 దశకంలో సహాయా గ్రూప్లో 12 లక్ష మంది ఉద్యోగులు పనిచేశారు. తరవాత అనేక ఆర్థిన నేరాల్లో ఇరుక్కుపోయారు. పెరల్స్ ఇండియా పేరుతో రూ.80 వేల కోట్లు డిపాజిట్లు సేకరించారు. సెబీ నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. కొంత కాలం సుబ్రతా రాయ్ జైలు శిక్ష అనుభవించారు. టీమ్ ఇండియాకు చాలాకాలంపాటు సహారా గ్రూప్ స్పాన్సర్గా కూడా వ్యవహరించింది.
రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ధర్నా