కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు డ్రెస్ కోడ్ విధించింది. తలను పూర్తిగా కప్పి ఉంచే టోపీలు, ముసుగు దుస్తులు ధరించడాన్ని నిషేధించింది. అలాంటి వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ప్రకటించింది. పరీక్షల్లో మోసాలు, కాపీయింగ్ను నివారించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు తలను మూసివేసే దుస్తులు ధరించడం, లోహపు ఆభరణాలు ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు కేఈఏ ప్రకటించింది. పెళ్లయిన మహిళలు మంగళసూత్రం, మెట్టెలు ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించింది. గతంలో వీటిపైన కూడా కేఈఏ నిషేధం విధించగా కొన్ని సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో విరమించుకుంది.
ఈ నెల 18, 19న పలు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్పై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో తాజా నిర్ణయం చర్చకు తెరతీసింది. హిజాబ్ (hijab) అనే పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. తలను కప్పిఉంచే దుస్తుల నిషేధం వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.