రాజకీయవైరం
కారణంగా చోటుచేసుకుంటున్న ఘర్షణలతో పశ్చిమబెంగాల్ అట్టుడుకుతుంది. తృణమూల్
కాంగ్రెస్(TMC), సీపీఎం(CPM) మధ్య వైరం సామాన్య ప్రజానీకాన్ని
తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఇరువర్గాల
మధ్య జరుగుతున్న పరస్పర దాడులతో ఆ రాష్ట్ర ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడపాల్సిన
పరిస్థితి దాపురించింది. హత్యారాజకీయాలతో ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు
యత్నిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
పశ్చిమ
బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమల్
కాంగ్రెస్ (TMC) నేత హత్యతో ఆ ప్రాంతంలో ప్రతీకారదాడులు
జరుగుతున్నాయి. ఆందోళనకారులు పలు నివాసాలకు నిప్పుపెట్టారు.
జోయనగర్
లో తృణమూల్ నేత సైఫుద్దీన్ లస్కర్ ను దుండగులు కాల్చి చంపారు. ఆయన నివాస
సమీపంలో హతమార్చడం కలకలంరేపింది.
లస్కరే
టీఎంసీలో కీలక నేతగా ఉండగా, ఆయన భార్య సర్పంచ్ గా విధులు నిర్వహిస్తున్నారు.
లస్కరే
మద్దతు దారులు ఈ ఘటనతో కోపోద్రిక్తులై హత్యలో అనుమానితులుగా ఉన్న వారిని దాడి చేసి
హతమార్చారు. అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్ళకు నిప్పుపెట్టారు.
సీపీఎం మద్దతుదారులే తమ నేతను హత్య చేశారని చెబుతున్నారు.
సీపీఎం పై వస్తున్న ఆరోపణలను ఆపార్టీ నేత సుజన్ చక్రవర్తి తిప్పికొట్టారు. తృణమూల్
కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాల కారణంగా హత్య జరిగిందని చెబుతున్నారు.
సీపీఎం పై అభాండాలు వేయడం వల్ల టీఎంసీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా
విచారణ చేపట్టి కుట్రను బయటపెట్టాలని కోరారు.
హత్య
ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు
నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.