యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది.
కలెక్టరేట్ పనిచేస్తున్నఇద్దరి ఉద్యోగుల మధ్య వివాదం కత్తిపోట్లకు దారితీసింది.
ఆత్మకూరు మండలంలో వ్యవసాయ విస్తరణాధికారి గా విధులు నిర్వహిస్తున్న మనోజ్ పై మండల
వ్యవసాయ అధికారిణి శిల్ప కత్తితో దాడి చేశారు.
శుక్రవారం ఏవో కార్యాలయంలోనే వీరిద్దరి
మధ్య గొడవ జరిగిందని, అనంతరం ఇద్దరూ వాదించుకుంటూ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళారని
తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన ఏవో శిల్ప మనోజ్పై కత్తితో దాడి చేసింది.
దాడి ఘటనలో మనోజ్ వీపు భాగంలో
గాయమైంది.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిల్పను అదుపులోకి
తీసుకున్నారు. మనోజ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే మనోజ్పై శిల్ప
దాడి చేసినట్లు సమాచారం.