ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో మూడున్నర దశాబ్దాల కిందట అప్పటి ప్రభుత్వం కె. రాఘవేంద్రరావుకు రెండెకరాల భూమి కేటాయించింది. సినీ స్టూడియోల కోసం కేటాయించిన భూమిలో మల్టీఫ్లెక్స్ నిర్మించారని మెదక్ జిల్లాకు చెందిన బాలకిషన్ హైకోర్టులో (Telangan Highcourt) పిల్ వేశారు. తక్కువ ధరకు రాయితీతో ప్రభుత్వం వద్ద నుంచి భూమి పొంది, నిబంధనలకు విరుద్దంగా భూమిని వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని, అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేయాలని పిటీషనర్ కోరారు.
ఈ పిటీషన్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, ఆయన సోదరుడు కె.కృష్ణమోహన్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.