పొరుగుదేశం నేపాల్ను భూకంపం (nepal earth quake) కుదిపేసింది. తాజాగా నేపాల్లో వచ్చిన భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. గడచిన మూడు రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నేపాల్ భూకంపం తీవ్రతకు, ఢిల్లీలోనూ భూమి స్వల్పంగా కంపించింది.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు ఉత్తరంగా 233 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. నేపాల్ భూకంప తీవ్రత ప్రభావం ఢిల్లీ ప్రజలనూ భయాందోళనలకు గురిచేసింది. ఢిల్లీ ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇళ్లలో పర్నిచర్ ఊగిపోయిందని స్థానికులు తెలిపారు. అయితే భూకంపం నష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ధర్నా