అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను కొందరు గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు(supreme court)లో పిటిషన్లు వేశాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా ఇలాంటి పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీల్లో ఆమోదించి పంపే బిల్లుల విషయం తమ దాకా రాకముందే నిర్ణయిం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల విషయంలో పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచౌడ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఇలాంటి విషయాలు సుప్రీంకోర్టుకు రాకముందే బిల్లులపై నిర్ణయం తీసుకోవాలిని సూచించింది. గవర్నర్లకు ఆత్మపరిశీలన అవసరమని వ్యాఖ్యానించింది. గవర్నర్లు ప్రజా ప్రతినిధులు కాదని గుర్తుంచుకోవాలని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది.
రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ధర్నా