తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రధానం చేశారు. స్వామి వారి సేవలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అత్యంత విశేషమైన పుష్పక విమాన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ జరగనుంది.మూడు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అధికమాసంలో మాత్రమే పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ లక్ష మందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల భద్రతకు 4 వేల మంది పోలీసులను మోహరించారు. 1200 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.