వన్డే
ప్రపంచకప్ -2023 టోర్నీలో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ పై భారీ
అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రీడాభిమానులు పోటెత్తనున్నారు.
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు
జరుగుతున్నాయి.
ముంబై
నుంచి అహ్మదాబాద్కు ఓ వందే భారత్ సహా రెండు ప్రత్యేక రైళ్ళను నడిపేందుకు రైల్వే
శాఖ సిద్ధమైంది. క్రీడా ఈవెంట్ కోసం పశ్చిమ రైల్వే రెండు నగరాల మధ్య రైళ్ళను నడపడం
ఇదే తొలిసారి.
ఏసీ
సౌకర్యంతో కూడిన ఈ రైలు, రాత్రి 9.30 గంటలకు ముంబై నుంచి బయల్దేరి తర్వాతి రోజు
ఉదయం 5.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకోనుంది. మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు
అహ్మదాబాద్ నుంచి బయల్దేరే రైలు మధ్యాహ్నం ముంబైకి చేరుకోనుంది.
అలాగే
భారత్ తో పాటు పాకిస్తాన్ కు చెందిన ప్రముఖులు కూడా చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్
చూసేందుకు వస్తున్నట్లు సమాచారం. మ్యాచ్ కు ముందు నిర్వహించే కర్టన్ రైజర్ లో
సచిన్, అమితాబ్, రజనీకాంత్ ను బీసీసీఐ ఆహ్వానించింది. అలాగే కేంద్ర హోంమంత్రి
అమిత్ షా కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
పాకిస్తాన్
క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జాకా అష్రఫ్ నేడు అహ్మదాబాద్ కు రానున్నారు. మ్యాచ్
కవరేజీ కోసం పాకిస్తాన్ జర్నలిస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించిడంతో ఆయన తన పర్యటనను
ఖరారు చేసుకున్నారు. పాక్ కు చెందిన 60 మంది జర్నలిస్టులు వీసా కోసం దరఖాస్తు
చేసుకున్నారు.